
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లోని త్రయోదశి తిథిని ధన త్రయోదశి అని అంటారు. దీనినే ధనతేరాస్ అని పిలుస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18న ధన్ తేరాస్ ను జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున చీపురు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ధనతేరాస్ నాడు చీపుర్లు ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ధన్ తేరస్ రోజున చీపుర్లు కొంటారు ఎందుకంటే అవి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం ధన్ తేరస్ నాడు చీపురు కొని ఇంటికి తీసుకుని రావడం అంటే.. లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువచ్చినట్లే. ఈ రోజున చీపురు కొనడం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది.

చీపురు ఇంటి లోని ప్రతికూల శక్తిని , పేదరికాన్ని తొలగిస్తుంది. అందువల్ల ధన్ తేరాస్ నాడు ఇంటికి కొత్త చీపురు తీసుకురావడం వల్ల ఆనందం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. అంతేకాదు ధన్ తేరాస్ నాడు చీపురు కొనడం వల్ల శ్రేయస్సు వస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది.

ధన్తేరస్ నాడు చీపురు కొని తర్వాత ఆ చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ధన్తేరస్ నాడు చీపురు కొనడం పేదరికాన్ని దూరం చేయడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది.

హిందువులు చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించడానికి.. ఆమె ఉనికిని ఇంట్లో ఉంచడానికి ధన్తేరస్ నాడు చీపురు కొని దానిని పూజిస్తారు. అయితే ఇలా ధన్తేరస్ నాడు కొనుగోలు చేసిన చీపురును అదే రోజున ఉపయోగించకూడదు. పండగ తర్వాత వచ్చే గురువారం రోజు నుంచి ఈ చీపురుని ఉపయోగించాలి. అంతేకాదు ఎప్పుడూ చీపురుని కాలితో తన్నరాదు