
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ బైక్ రైడ్ చేపట్టారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.

స్పోర్ట్స్బైక్ను నడుపుతూ రాహుల్ ఎంజాయ్ చేశారు. లద్దాఖ్లో తొలుత రెండు రోజుల పాటు పర్యటించాలి అనుకున్నారు..

తద్వారా రెండు రోజులు అనుకున్న ఆయన తన పర్యటనను పొడిగించుకున్నారు. ఆరు రోజుల పాటు లద్దాఖ్లో రాహుల్ పర్యటన కొనసాగుతుంది.

ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో లేహ్ , పాంగాంగ్ సరస్సు ఒకటని తన తండి రాజీవ్గాంధీ చెప్పారని అన్నారు రాహుల్గాంధీ.

అందుకే తారు ఆ ప్రాంతాలను సందర్శిస్తునట్టు చెప్పారు. ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉంది.

తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను రాహుల్ పాంగాంగ్ సరస్సు వద్ద జరుపుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

లద్దాఖ్లో లో తన తొలి పర్యటన సందర్భంగా రాహుల్ శుక్రవారం లెహ్లో 500 మంది యువకులతో 40 నిమిషాల పాటు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.

ప్రస్తుతం రాహుల్గాంధీ బైక్ రైడ్ కు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ప్రజలు కూడా ఈ ఫొటోస్ కు పలు రకాలుగా స్పందిస్తున్నారు.