
ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలు తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది జనాల్లో. అయితే ఇకపై అన్ని చోట్లా సెల్ఫీలు తీసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

రైల్వే ట్రాక్పై సెల్ఫీ నిషేధం- భారతదేశంలోని రైల్వే ట్రాక్పై సెల్ఫీ తీసుకుంటే మీరు జైలుకు వెళ్లాల్సిందే. ఎందుకుంటే, ఇటీవల గత కొంతకాలంగా రైల్వే ట్రాక్లపై అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లపై సెల్ఫీలు దిగడాన్ని నిషేధించారు.

కుంభమేళాలో సెల్ఫీలు నిషేధం- భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఉత్సవాలలో ముఖ్యమైన కుంభమేళా వస్తుంది. జాతరకు హాజరయ్యేందుకు వేల, లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. కుంభమేళాలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెల్ఫీలు తీసుకోవడం నిషేధించారు.

లోటస్ టెంపుల్ వద్ద సెల్ఫీలు నిషేధం.. సెల్ఫీలు తీసుకోవడం నిషేధించబడిన అనేక పర్యాటక ప్రదేశాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఢిల్లీలోని లోటస్ టెంపుల్ తీసుకోండి, బయటి ప్రాంతాల్లో ఫోటోలు తీయడాన్ని ఎవరూ నిషేధించరు, కానీ ప్రార్థన స్థలంలో సెల్ఫీలు తీసుకోవడం అనుమతించబడదు.

గోవాలోని ఇక్కడ సెల్ఫీలు నిషేధం- గోవాలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, గోవాలోని ఎత్తైన బండరాళ్లు, సముద్ర ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడం నిషేధం. గోవాలని అనేక బీచ్లలో ఫోటోలు తీయడం కూడా నిషేధించబడింది. నిజానికి, ఇక్కడ ఓటింగ్ పోల్ బూత్లో కూడా మీరు సెల్ఫీ తీసుకోలేరు.