
కావాల్సిన పదార్ధాలు : 300 గ్రాముల రొయ్యలు, రెండు కప్పులు బెండకాయలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు , ఒక కప్పు టమాటా ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని తీసుకోవాలి.

ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని వాటిని వేడి నీటిలో బాగా క్లీన్ చేసి రెండు సార్లు ఉప్పులో మళ్ళీ కడగాలి. అలాగే, బెండకాయలను కూడా తీసుకుని నీళ్ళతో కడిగి కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా వేయించాలి. గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా పొడి బాగా కలుపుకోవాలి. అలాగే, బెండకాయ ముక్కలు వేసి 15 నిమిషాలు పాటు బాగా వేయించాలి. వాటితో పాటు చింత పండును రసం వేసి బాగా మరిగించాలి.

చివర్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల ముక్కలు వేసి 20 నిముషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసి బాగా వేయించాలి.