
నా పేరు ముఖేష్, నేను పోగాకు , గుట్కా తీసుకోవడం వలన నా పరిస్థితి ఇలా అయ్యిందంటూ చెప్పే ఇతని గురించించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. థియేటర్లో సినిమా చూసే ప్రతి ఒక్కరికీ మూవీ కంటే ముందు ఈ యాడ్ కనిపిస్తుంటుంది. అయితే చాలా మందికి అసలు ఈ ముఖేష్ ఎవరో తెలియదు. కాగా, ఈయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖేష్, మహారాష్టాలోని భుసావల్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఇతను రోజూ కూలీ చేస్తూ జీవనం సాగించే వ్యక్తి. ఇతని సంపాదనపైనే కుటుంబం జీవనం సాగించేది. అయితే ఇతనికి స్నేహితుల వలన గుట్కా నమలడం అలవాటై, చివరికి అది ప్రాణాల మీదకు వచ్చింది. అయితే చాలా మంది ఈయన నోటి క్యాన్సర్ వలన చనిపోయారు అనుకుంటారు. కానీ కారణం అది కాదంట.

ముఖేష్ చనిపోయి ఇప్పటికీ దాదాపు 17 సంవత్సరాలు గడిచిపోయిందంట. అయితే చాలా మంది ఈయన గుట్కా నమలడం వలన నోటి క్యాన్సర్ బారినపడి అతి చిన్న వయసులో 24 సంవత్సరాలకే మరణించాడు అనుకుంటారు. కానీ ముఖేష్ చనిపోయింది కేవలం నోటి క్యాన్సర్ వల్ల మాత్రమే కాదంట.

ముఖేష్ 2009లో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అప్పటికీ ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిదంట. ఆ సమయంలోనే ఈ యాడ్ షూట్ చేశారు. తాను పొగాకు బానిస అయ్యాను, అమ్మ వద్దు అన్నా వినలేదు, చివరికి ఇలా అనారోగ్యంతో పోరాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ ముఖేష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యాడంట. ముఖ్యంగా ఈయనకు ఫుడ్ పైప్లో ఇన్ఫెక్షన్ రావడంతో చనిపోయాడంట. కానీ చాలా మంది ఈయన క్యాన్సర్ వలన చనిపోయాడు అనుకుంటారు. కానీ ముఖేష్ చనిపోయింది ఫుడ్ పైప్ ఇన్ఫెక్షన్ వల్ల నంట. చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.