
ఎండు చేపలను చాలా మందికి తినాలనే ఉంటుంది. కానీ ఇది తిందామంటే నీచు వాసన వస్తాయి. దాని వలన చాలా మంది తినకుండా ఆగిపోతారు. అయితే, మీరు వండేటప్పుడు ఈ బామ్మల కాలం నాటి చిట్కాలు ఫాలో అయితే, వాసన రాదు. కమ్మగా వండుకుని తింటారు.

ఎండు చేపలను వాసనను పూర్తిగా పోగొట్టే చిట్కాలు: మీరు కూర వండటానికి ప్రిపేర్ అయ్యే ముందు ఎండు చేపలను వేడి నీటిలో నానబెట్టి దానిలో ఐదు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి 20 నిమిషాలు బెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఇంకా ఎండు చేపలను వండేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంకా మీరు కుక్ చేసేటప్పుడు వండేటప్పుడు ఒక టేబుల్ చింతపండు రసం కానీ ఒక కప్పు పాలు పోసిన కానీ నీచు వాసన మొత్తం పోతోంది.

ఒక గ్లాస్ లో కొద్దిగా నీరు తీసుకుని, దానిలో వెనిగర్ వేసి బాగా మరిగించడం వలన కిచెన్ లో వచ్చే ఎండు చేపల వాసన మొత్తం పోతుంది. అలాగే, బియ్యపు నీరుతో వీటిని కడిగితే వాసన, ఇసుక ఉన్నా కూడా పోతోంది.

ఉదయం పూట గేదె పాలు తప్పక దొరుకుతాయి. ఈ ఎండు చేపలను తీసుకుని పాలలో నానాబెడితే ఆ వాసన మొత్తం విరిరిపోతోంది. ఆ తర్వాత నీటితో రెండు నుంచి మూడు సార్లు కడిగితే వాసన అస్సలు రాదు.