
మనం మినప పిండితో వేసిన దోసలు మాత్రమే చూశాము. కానీ, వాటి కన్నా కూరగాయలతో వేసిన దోసలు నోటికి మంచి రుచిని ఇస్తాయి కరివేపాకు దోస గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని చోట్ల చాలా ఫేమస్. ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన బ్రేక్ ఫాస్ట్.

ముందుగా దోస పిండి తయారు చేసుకోవాలి : ఒక కప్పు బియ్యం, అర కప్పు మినపప్పు, ఒక టేబుల్ టీస్పూన్ మెంతులు కూడా వేసి ఒక 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానాబెట్టుకుంటే దోస కర కర లాడుతుంది. ఇంకా దీనిలో అన్నం కలిపినా కూడా టేస్ట్ బావుంటుంది.

ఈ నానిన పప్పును తీసుకుని రెండు కప్పుల కరివేపాకులు 5 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి దానిని మెత్తగా రుబ్బుకోవాలి. మీకు ఇంకా జోరుగా కావాలనుకుంటే నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో కరివేపాకులు వేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి, పెనం వేడిగా అయ్యాక తర్వాత నూనె లేదా నెయ్యి వేసి, ఒక గరిటెడు పిండిని వేసి పెనం మీద దోసలా పోయండి. రెండు వైపులా బాగా కాల్చి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కాల్చిన అట్టును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు కాల్చిన దోసను ఒక ప్లేట్ లోకి తీసుకుని పల్లీల చట్నీతో కానీ పండు మిర్చి చట్నీతో కానీ తింటే రుచి అదిరిపోతోంది. అంతే కాదు, ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరస్తుంది.కరివేపాకులో ఉండే పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి