
చక్కెర వ్యాధిగ్రస్తులకు రాగులు బెస్ట్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగులు, రాగి పిండి ఒక గ్లూటెన్ రహిత ధాన్యం, కాల్షియం, ప్రోటీన్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలకు నిల్వ. దీని ఉపయోగం మీ శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. మిల్లెట్ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రాగులను తినడం వల్ల శరీరంలో రక్త కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా రాగి దోసె చేసి తిన్నారా? లేకపోతే, ఈ రోజు మనం రాగి దోస తయారీకి సంబంధించిన రెసిపీని తెలుసుకుందాం..రాగి దోస రుచికరమైనది. పోషకమైనది. మీరు బరువు తగ్గడానికి రాగి దోసె చేసి తినవచ్చు.

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం,అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్ వంటిది.

రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది. కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది.