
కావాల్సిన పదార్దాలు : అర కప్పు బార్లీ, అర కప్పు పెసలు, అర కప్పు రాజ్మా గింజలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా మిల్లెట్స్ ను తీసుకోవాలి: మీరు ముందుగా కొద్దిగా అర కప్పు బార్లీ, అర కప్పు పెసలు, అర కప్పు రాజ్మా గింజలను తీసుకుని 10 గంటల పాటు వాటిని బాగా నానబెట్టుకోవాలి. అంటే ఒక రాత్రి మొత్తం అలాగే పక్కన పెట్టి ఉదయం లేచిన వీటిని తీసుకుని మెత్తగా అయ్యాయో? లేవో చూడాలి.

ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఇలా ఉడికించాలి: మీరు ప్రెషర్ కుక్కర్ ను తీసుకుని వాటిలో వేసి అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 5 నుచి ఆరు విజిల్స్ వచ్చేవరకు బాగా ఉడికించాలి. ఇలా చేస్తే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఉడకకుండా వీటిని కిందకు దించేయకండి దీనిని అస్సలు మర్చిపోకండి.

పాన్ లో వీటిని ఇలా వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి ఆ తర్వాత పాన్ పెట్టి ఆయిల్ చేసి అది వేడి అయినా తరవాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి కూడా వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి.

చివర్లో వీటిని వేసి గార్నిష్ చేయాలి: ఉడికిన పప్పులో దానిని వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా మరిగించాలి.ఇక చివర్లో కొద్దిగా కొత్తిమీరను చల్లి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి వేడిగా తినడమే. ఇలా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు