
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో RCB పేసర్ మహ్మద్ సిరాజ్ తన భీకర బౌలింగ్ ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో RCB టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 2వ ఓవర్లో రీస్ టాప్లీ 9 పరుగులు ఇచ్చాడు. 3వ ఓవర్లో సిరాజ్ మళ్లీ 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. అలాగే ఇషాన్ కిషన్ను పెవిలియన్ పంపించాడు.

ఈ వికెట్తో మహ్మద్ సిరాజ్ ఆర్సీబీ తరఫున 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఘనత సాధించిన RCB 6వ బౌలర్గా నిలిచాడు. గతంలో యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, వినయ్ కుమార్, అనిల్ కుంబ్లే, ఎస్ అరవింద్ ఈ ఘనత సాధించారు.

Mohammed Siraj

కాగా ఈ మ్యాచ్లో సిరాజ్ తొలి 3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఇషాన్ వికెట్ తీసుకున్నాడు. అయితే తన చివరి ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు.