ASIA CUP 2022: 2022 ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ మళ్లీ తలపడనున్నాయి. వరుస విజయాల బాట పట్టేందుకు భారత్ బరిలోకి దిగనుండగా.. పాక్ ప్రతీకార ధోరణితో బరిలోకి దిగనుంది. అయితే, 539 రోజుల భారత బ్యాట్స్మెన్ దెబ్బకు మరోసారి పాక్ జట్టు ఓడిపోవాల్సిందే.
539 రోజుల బ్యాట్స్మెన్ అంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అని అర్థం. అలా ఎందుకు అంటున్నారు అనే కదా మీ ప్రశ్న. T20 ఇంటర్నేషనల్లో సూర్యకుమార్ ఎంట్రీ గురించే అన్నమాట.
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ T20లో అరంగేట్రం చేసి నేటికి 539 రోజులు అయ్యింది. అప్పటి నుంచి అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సమయంలో అతను 23 ఇన్నింగ్స్లలో 758 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ 14 మార్చి 2021న తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సూర్య తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ 26 ఇన్నింగ్స్ల్లో 747 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి బలమైన ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్ల్లో 474 పరుగులతో ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ T20I అరంగేట్రం నుంచి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్లలో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉన్నాడు.