మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇప్పుడు ఇండోర్లో ఇరు జట్లు రెండో టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ ఆదివారం అంటే జనవరి 14న జరగనుంది. తొలి టీ20 మ్యాచ్లో 14 నెలల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లోకి అడుగు పెట్టగా, ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్లో కింగ్ కోహ్లీ రంగంలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
నిజానికి టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్లో ఆడేందుకు టీమ్ ఇండియా అనుమతించలేదు. అయితే, తన కుమార్తె పుట్టినరోజు కారణంగా విరాట్ కోహ్లీ తొలి టీ20 మ్యాచ్కు అందుబాటులో లేడు. కాగా, రెండో టీ20 మ్యాచ్తో కోహ్లీ జట్టులోకి రానున్నాడు.
అంటే, విరాట్ కోహ్లీ రాకతో జట్టులోని ఓ ఆటగాడు బెంచ్లో కూర్చోవడం ఖాయం. కాబట్టి విరాట్ కోహ్లీకి జట్టులో చోటు కల్పించేందుకు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఏ ఆటగాడిని తొలగిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం తొలి టీ20 మ్యాచ్లో అంటే మూడో ఆర్డర్లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ తిలక్ వర్మ రెండో టీ20 మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, గత కొన్ని మ్యాచ్ల్లో తిలక్ వర్మ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.
తొలి మ్యాచ్లో శుభారంభం అందించిన తిలక్ చివరి వరకు ఈ లయను కొనసాగించలేకపోయాడు. తొలి టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉన్నాయి.