
12 ఏప్రిల్ 1997న బీహార్ రాష్ట్రంలోని సహర్సా లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఉల్కా గుప్తా. పెరిగింది మాత్రం మహారాష్ట్ర రాజధాని ముంబైలో. ఆమె తండ్రి గగన్ మరియు ఆమె చెల్లెలు గోయా కూడా నటులే. ముంబైలోని దహిసర్లోని రుస్తోమ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది.

ఈ వయ్యారి మొదట రేషమ్ దంఖ్లో కెమెరా ముందుకు వచ్చింది. ఆపై సాత్ ఫేరే – సలోని కా సఫర్లో సలోని కూతురు చైల్డ్ సావ్రీ సింగ్గా కనిపించింది. ఆమె ఝాన్సీ కి రాణిలో మను పాత్రలో నటనకు దేశవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది.

నటన పట్ల అంకితభావంతో ‘ఝాన్సీ కి రాణి’లో ‘మను’ క్యారెక్టర్ రోల్ కోసం రెండు నెలల పాటు గుర్రపు స్వారీ, కత్తియుద్ధంలో శిక్షణ తీసుకుంది. దీని కోసం సంస్కృతం శ్లోకాలను కూడా నేర్చుకుంది. తర్వాత మరికొన్ని సీరియల్స్ లో కనిపించింది. ప్రస్తుతం మెయిన్ హూన్ సాథ్ తేరే అనే సీరియల్ చేస్తుంది.

2015లో ఆంధ్రా పోరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా చిత్రం రుద్రమదేవి చిత్రాల్లో స్వీటీ చిన్ననాటి పాత్రలో ఆకట్టుకుంది.

2016లో ట్రాఫిక్ అనే సినిమాతో బాలీవుడ్ వెండి తెరపై తొలిసారి కనిపించింది. 2017లో మిస్టర్ కబాడీ సినిమా చేసింది. అదే ఏడాది శ్రేష్ఠ బంగాలీ అనే ఓ బెంగాలీ. వీటితో పాటు 2018లో ఓద్ - ది అట్రాక్షన్ అనే మరాఠీ సినిమాలో నటించింది. తర్వాత సింబా అనే మరో హిందీ మూవీ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించలేదు.