
జెనీలియా డిసౌజా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది జెనీలియా. అమితాబ్ బచ్చన్తో కలిసి చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది.

2003లో హిందీ చిత్రం తుఝే మేరీ కసమ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. అదే సంవత్సరం తమిళ చిత్రం బాయ్స్లో నటించి దక్షిణ భారత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఇక తెలుగులో సత్యం , సై , బొమ్మరిల్లు , ఢీ, రెడీ , కథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు (ఉత్తమ నటి - తెలుగు) లభించింది. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది.

హిందీలో మస్తీ (2004), జానే తు... యా జానే నా (2008), తమిళంలో సంతోష్ సుబ్రమణియం (2008) వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది జెనీలియా.

2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు - రియాన్ (2014), రాహిల్ (2016). సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.