
టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగమ్మాయిలకు అంతగా ఆఫర్స్ రావు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కానీ ఈ చిన్నదానికి మాత్రం మంచి ఆఫర్స్ వచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు ఈషా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో సినీ ప్రియులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించిన ఈ అమ్మడు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ సినీ ప్రియులను అలరించింది. కానీ ఇప్పుడు ఆ అంతగా స్క్రీన్ మీద కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.