
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. జవాన్ సినిమాతోనూ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించిన పారితోషికం తీసుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఓ హీరో సినిమాలో నటించి తప్పు చేశానని అంటుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది నయన్. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. 2005లో ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రంలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

గజినీ సినిమాలో ఆసిన్ కథానాయికగా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలో తనను చెడుగా చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉందని చెప్పి.. అలా చూపించలేదని అన్నారు. అది తనను ఎంతో బాధించిందని.. ఆసినిమా చేసి తప్పు చేశానని గతంలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయన్ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రస్తుతం నయన్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.