
నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్నూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే కుర్రకారు కలలా రాకుమారిగా మారిపోయింది ఈ చిన్నది.

ముఖ్యంగా అను కళ్ళకు ఫిదాకాని కుర్రాడు ఉండడేమో.. మజ్ను సినిమాలో తన అమాయక చూపులు, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తెలుగు కుర్రకారును కవ్వించింది.

ఆ తర్వాత, 2016లో "యాక్షన్ హీరో బిజు" అనే మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో తెలుగులో "మజ్ను" చిత్రంలో నాని సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనప్రేక్షకులను మెప్పించింది.

అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన ఈ క్యూట్ హీరోయిన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో బిజీగా నటిస్తోంది. తర్వాత ఆమె పవన్ కళ్యాణ్తో "అజ్ఞాతవాసి", అల్లు అర్జున్తో "నా పేరు సూర్య" వంటి తెలుగు చిత్రాలలో నటించింది, అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు.

దాంతో తమిళ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళంలో "తుప్పరివాలన్" (2017)తో అరంగేట్రం చేసిన ఈబ్యూటీ, "నమ్మ వీట్టు పిళ్లై" (2019) చిత్రంతో కమర్షియల్ విజయం సాధించింది. చాలా రోజులుగా ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో షేక్ చేస్తుంది ఈ కలువ కళ్ళ సుందరి.