
ఒక్క బ్లాక్బస్టర్తో కెరీర్ ఎలా మారిపోతుందో తెలియాలంటే ఆ హీరోయిన్ను చూపిస్తే చాలు..! సింగిల్ హిట్తో సినిమాలన్నీ ఆమె ఖాతాలోకే వెళ్లిపోతున్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా హీరోలంతా ఆ బ్యూటీనే కావాలంటూ ఆమె జపమే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళంలో ఆ బ్యూటీ సెన్సేషన్ ఇప్పుడు. మరి అంతగా సంచలనాలు రేపుతున్న ఆ భామ ఎవరు..?

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడెలా టర్న్ అవుతుందో చెప్పలేం..! కావాలంటే మమిత బైజునే తీసుకోండి.. మలయాళం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకునే స్థాయి నుంచి.. ఈ రోజు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయే స్థాయికి ఎదిగారు బైజు.

ఈ బ్యూటీ డేట్స్ ఇప్పుడు తమిళంలో హాట్ కేక్. ప్రేమలు తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది. మలయాళంలో 10 సినిమాలకు పైగానే నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.. కానీ గతేడాది విడుదలైన ప్రేమలు సినిమాతో మమిత రేంజ్ మారిపోయింది.

ప్రస్తుతం తమిళంలో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. ప్రదీప్ రంగనాథన్తో డ్యూడ్ సినిమాలో నటిస్తున్న ఈమె.. సూర్య, వెంకీ అట్లూరి సినిమాలోనూ మెయిన్ హీరోయిన్గా నటిస్తున్నారు.

విజయ్ చివరి సినిమా జన నాయగన్లోనూ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఇందులో హీరోయిన్ కాదు గానీ అంతకు మించిన పాత్రలో నటిస్తున్నారు బైజు. తాజాగా ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి సినిమాలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్లోనూ మమితకు మతిపోయే ఆఫర్స్ వస్తున్నాయి.