
మహేష్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయం ఈ బ్యూటీ సొంతం. తన ఫ్యామిలీనీ, బిజెనెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడూ ఫుల్ బిజీగా గడిపేస్తుంటుంది ఈ చిన్నది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సితారా, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

కానీ తాజాగా ఈ బ్యూటీ బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసి, వావ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత నమ్రత అదిరిపోయే లుక్లో కనిపించింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ నమ్రత ఈ జ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అందాల ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టి వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక మహేష్ బాబుతో పెళ్లి తర్వాత ఈ చిన్నది చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమైందనే చెప్పా్లి. సినిమాలకు గుడ్ బై చెప్పి, మహేష్ బాబుకు సంబంధించిన ప్రతీది, కుటుంబం, వ్యాపారాలు అన్నింటి బాధ్యతలు తీసుకొని, గృహిణిగా మంచి పేరు తెచ్చుకుంది.

ఇక ఎప్పుడూ ఫ్యామిలీ ఈ వెంట్స్లో మాత్రమే చాలా స్పెషల్గా కనిపించే ఈ చిన్నది, చాలా రోజుల తర్వాత రిసార్ట్లో తన అందాలతో రచ్చ చేసింది. సింపుల్ లుక్లో కనిపించి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.