
మంజు వారియర్.. మలయాళ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు పోషించి అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. నివేదికల ప్రకారం, మంజు వారియర్ ఆస్తుల విలువ దాదాపు రూ. 142 కోట్లు.

ఆమె సినిమాల నుంచి బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారాలతో ఎక్కువగా సంపాదిస్తుంది. ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. మంజు వారియర్ ఒక్కో చిత్రానికి రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు భారీ మొత్తాన్ని తీసుకుంటుంది.

ఆమె మలయాళ చిత్రాలలోనే కాకుండా, ధనుష్ సరసన 'అసురన్', అజిత్ కుమార్ సరసన 'తునైవు' వంటి తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఆమెకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నివేదికల ప్రకారం ఆమె ప్రతి ఎండార్స్మెంట్కు దాదాపు రూ. 75 లక్షలు అందుకుంటుంది. మంజు వారియర్ కు బైక్ లు అంటే చాలా ఇష్టం. ఆమె వివిధ మోడళ్ల బైక్ లను సేకరించడానికి ఇష్టపడుతుంది. ఇటీవలే దాదాపు రూ. 21 లక్షల విలువైన BMW R 1250 GS ను కొనుగోలు చేసింది.

మంజు వారియర్ ఇప్పటికీ సినిమాల్లో విభిన్న పాత్రలకు ప్రాణం పోసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.