
పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. కొన్నాళ్లుగా పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన ఈ అమ్మడు.. ఇప్పుడు థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇందులో భూమ దేవి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది.

ఈ సినిమాకు రష్మిక కేవలం 3 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకుందని సమాచారం. నిజానికి ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగుతోపాటు హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం రష్మిక వయసు 29 సంవత్సరాలు. కానీ నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.70 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకు రూ.8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక రష్మిక నటించిన చిత్రాలు వరుసగా 500 కోట్లకు పైగా రాబట్టాయి.

రష్మిక వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద బెంజ్, ఆడీ, రేంజ్ రోవర్ లాంటి కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, కూర్గ్ ప్రాంతాలలో సొంతంగా ఇళ్లు ఉన్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్, వ్యాపారరంగాల్లోనూ ఈ అమ్మడు భారీగానే సంపాదిస్తుంది.