
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్. గతేడాది మాస్ మహరాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మడు.

తొలి చిత్రంలోనే గ్లామర్ షోతోపాటు అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకు పెద్దగా హెల్ప్ కాలేదు. అయితే తెలుగులో నెమ్మదిగా ఆఫర్స్ మాత్రం అందుకుంది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది.

మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ అమ్మడు నటించిన కింగ్డమ్ సినిమా విడుదలైంది. జూలై 31న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు..ఈ మూవీ ప్రమోషన్లలో గ్లామర్ లుక్స్ లో కట్టిపడేసింది భాగ్యశ్రీ. దీంతో ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

కొత్త నేషనల్ క్రష్ అదిరిపోయిందంటూ భాగ్యశ్రీ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన నటిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన పక్కన కాంత అనే చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.