
28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

ఈ వయ్యారి మొదట థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర గురించి ది హిందూ జర్నలిస్ట్ సంగీతా దేవి డూండూ ఫారియా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ని కలిగి ఉంది అని రాశారు.

2023లో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పబ్లిక్ ఇమేజ్ ఆ పాత్రతో సన్నిహితంగా ముడిపడి ఉందని ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్లో నామినేట్ చేయబడింది.

ఆమె 2022లో లైక్ షేర్ & సబ్స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

2024లో అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 చిత్రల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రభాస్ కల్కిలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.