మీడియం ఏదైనా ఒక్క చిన్న హిట్ ఇండస్ట్రీలో అందరినీ ఆలోచింపజేస్తుంది. ఫలానా కంటెంట్ హిట్ అయింది. ఫలానా డైరక్టర్ హిట్ అయ్యారు. ఫలానా హీరో సక్సెస్ చూశారు అంటూ జనాల మధ్య డిస్కసింగ్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీలో ధూతకు వచ్చిన సక్సెస్, విక్రమ్ మీద మాత్రమే కాదు... ఆయనలాంటి మరికొందరు డైరక్టర్ల మీద కూడా కాన్సెన్ట్రేషన్ పెరిగేలా చేసింది. ఇంతకీ ఎవరు వారు? ఏంటా కథ...
నాగచైతన్య నటించిన సీరీస్ ధూత. చైతూ జర్నలిస్టుగా నటించారు. ప్రతి ఫ్రేమ్లోనూ కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. చైతూ నటన, విక్రమ్ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతిదీ ఉత్కంఠను రేపింది. ఈ సీరీస్ చూసిన వారందరూ విక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అయితే బౌన్స్ బ్యాక్ అయింది సినిమాల్లో కాదు... సీరీస్లోనే అన్నది అండర్లైన్ అవుతున్న పాయింట్.
వెబ్ సీరీస్లో సత్తా చాటిన విక్రమ్ కె కుమార్ సినిమాల్లో ఈ స్పీడ్ ఎందుకు చూపించలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ టాపిక్ జస్ట్ విక్రమ్ గురించే కాదు... మరి కొంతమంది టాప్ డైరక్టర్లు కూడా అనుకుంటున్నారు.
టాప్ డైరక్టర్లుగా పేరు తెచ్చుకుని, స్టార్స్ తో యాక్సెస్ ఉండి కూడా సినిమాల్లో స్పీడ్ చూపించని క్రిష్ లాంటి డైరక్టర్ల మీదకు మళ్లుతోంది. ఆల్రెడీ నైన్ హవర్స్ తో వెబ్ కంటెంట్ క్రియేట్ చేయడంలో సూపర్బ్ అనిపించుకున్నారు. క్రిష్ హరిహరవీరమల్లు సినిమా ఆయనకు సెట్స్ మీద ఉంది.
క్రిష్ లాగానే పవన్తో సినిమా చేస్తున్న డైరక్టర్ హరీష్ శంకర్. పవర్ స్టార్తో ఉస్తాద్ భగత్సింగ్ చేస్తున్నారు హరీష్ శంకర్. హరీష్ చేసిన ఏటీయం సీరీస్కి కూడా అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది. ట్రెండ్ ఏదైనా సత్తా చాటుతామనే అంటున్నారు మన డైరక్టర్లు. అయితే ఇదే స్పీడు సినిమాల్లోనూ ఉంటే బావుంటుందనేది ఫ్యాన్స్ మాట.