
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో తనదైన ముద్రవేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ అమ్మడు.. క్యాన్సర్ సమస్యతో పోరాటం చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ హంసానందిని. ఒకటవుదాం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఆర్యన్ రాజేశ్ నటించిన అనుమానాస్పదం సినిమాతో హిట్టు అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత తెలుగులో అధినేత, అహా నా పెళ్లంటా వంటి చిత్రాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాల్లో కనిపించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది హంసానందిని. చాలా కాలం పాటు కీమోథెరపీ చికిత్స తీసుకుని క్యాన్సర్ నుంచి కోలుకుంది. గతంలో ఇదే సమస్యతో ఆమె తల్లి మరణించింది.

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.