
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబోలో తెరకెక్కిన సినిమా శివ. ఈ మూవీ నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నాగార్జునను ఈ మూవీ, ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చడమే కాకుండా, మంచి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కానుంది.

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసికల్ మూవీ శివ. ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ 1989లో తెరకెక్కించారు. నాగార్జునకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా, మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ మూవీని నవంబర్ 14న, 4కే డాల్బీ ఆట్మాస్ వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రెడీ చేసిన కథతో మరొకరు హిట్ కొట్టడం అనేది సహజం. అయితే ఈ క్రమంలోనే శివ మూవీని కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుగా నాగార్జునతో కాకుండా వెంకటేష్తో తియ్యాలి అనుకున్నారంట. దీంతో కథ రెడీ చేసి రామానాయుడికి కథ వినిపించాడంట. కానీ వెంకీ అప్పటి వరకు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తుండటంతో, ఇలాంటి మూవీ తియ్యడం వలన ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో అని ఈ కథను రిజక్ట్ చేశాడంట.

అంతే కాకుండా అసలు ఈ మూవీ ఎవరితో తియ్యాలని, రామ్ గోపాల్ వర్మ చాలా ఆలోచించాడంట. నాగార్జునతో తియ్యాలి అనుకుంటే, ఆయన అప్పటికే రొమాంటిక్ లవ్ స్టోరీస్ సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ చాలా కన్ఫ్యూజన్ల ఉండటంతో, అప్పుడు, రామానాయుడు ఈ మూవీకి నాగార్జున మాత్రమే కరెక్ట్గా సెట్ అవుతాడని చెప్పాడంట.

దీంతో ఆర్జీవీ నాగార్జునకు కథను చెప్పాడంట. ఇక కథ కూడా నాగార్జునకు నచ్చడంతో, ఆయన ఒకే చెప్పారంట. అలా శివ మూవీలో కింగ్ నాగార్జున మాస్ పాత్రలో నటించి, తన నటనతో అందరినీ మెప్పించి, రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ అప్పట్లోనే దాదాపు ఏకంగా ఐదు కోట్లకు పైగా షేర్ రాబట్టి, బిగ్గెస్ట్గా నిలిచింది.