
హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది.

ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.

యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు.

దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫఫోకస్ పెడుతుంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు దూరం అవుతుంది అని అంటున్నారు కొందరు అభిమానులు. తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ లో అవకాశాల కోసమే అని అంటున్నారు. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచి అభిమానులను కవ్విస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది ఈ వయ్యారి.