
అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గ్లామర్తో ఎంతో మంది మనసు దోచేసిన ఈ బ్యూటీ ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండటమే కాకుండా తన ఫ్యాషన్ తో అందరినీ తన వైపు లాక్కుంటుంది.

లైగర్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమం అయ్యింది అనన్య పాండే. ఈ మూవీతో టాలీవుడ్లో, పాన్ ఇండియా లెవల్లో మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అనుకుంది. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగులో ఛాన్స్లు కూడా లేకపోవడంతో బాలీవుడ్లోనే సినిమాలు చేస్తుంది.

ఇక బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ఏ మాత్రం సమయం దొరికినా సరే వెకేషన్స్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటిఫుల్ నటి ఇటాలియన్ కి వెకేషన్కు వెళ్లింది. అక్కడ తన డిఫరెంట్ స్టైలిష్ లుక్లో ఉన్న దుస్తులను ధరించి పచ్చటి చెట్ల మధ్య సరదాగా గడుపుతుంది.

తాజాగా ఈ అందాల చిన్నది తన ఇటాలియన్ ట్రిప్కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. అందులో ఈ బ్యూటీ లేత పసుపు రంగు ట్రెండీ డ్రెస్ ధరించి, చేతిలో బ్యాగ్తో ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతే కాకుండా బ్లూ డెనిమ్ జీన్స్ లో అందమైన లోయల్లో బోట్ రైడ్ చేస్తూ.. అక్కడి పచ్చటి ప్రకృతిని బ్యూటిఫుల్ ప్లేస్ను అందరికీ పరిచయం చేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ చిన్నది తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ కేసరి 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.