
అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ లోన్కు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. దీని వల్ల డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంది. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండి శాలరీ స్లిప్ అందిస్తే వెంటనే లోన్ మంజూరు చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులు రూ.50 వేల వరకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అవసరమైన పత్రాలు సమర్పిస్తే గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి డబ్బులు ట్రాన్సాఫర్ చేస్తున్నారు

దీంతో మీరు రోజుల తరబడి పర్సనల్ లోన్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో మీ అవసరాలకు నగదు త్వరగా చేతికి అందుతుంది. బ్యాంకులతో పాటు ఎన్ఎఫ్బీసీ సంస్థలు ఈ రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాలపై వార్షిక వడ్డీ రేటు 9.9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ వెబ్ సైట్, యాప్ ద్వారా సులువుగా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం ఉండదు.

బ్యాంకులు కొంతమంది కస్టమర్లకు ప్రీఅప్రూవ్డ్ పర్సనల్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ఈ లోన్లను సలువుగా పొందే అవకాశముంది. పర్సనల్ లోన్ అర్హతల విషయానికొస్తే.. వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు జీతం పొందుతూ లేదా స్వయం ఉపాధి పొందుతూ ఉండాలి. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉండాలి.

కనీసం ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం కనీసం రూ.15 వేలుగా ఉండాలి. బ్యాంక్ను బట్టి అర్హతల్లో తేడాలు ఉండవచ్చు. దీంతో వ్యక్తిగత రుణం తీసుకునే ముందు బ్యాంక్ అర్హతలను పరిశీలించండి. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలు అందించాలి. ఇక విద్యుత్, గ్యాస్ బిల్లు లాంటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి.

బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, శాలరీ స్లిప్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంకును బట్టి ఇతర పత్రాలు అవసరం పడతాయి. ఇక బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. దీంతో తక్కువ వడ్డీ ఏ బ్యాంకులో వస్తుందనేది పరిశీలించండి.