
ఎంతో మంది ఆదివారం రాగానే ఇంట్లో ఏదోక నాన్ వెజ్ చేసుకుని తింటారు లేదా రెస్టారెంట్ కు వెళ్లి ఇష్టమైనది చేసుకుని తింటారు. ఎందుకంటే వారం మొత్తం పని చేసి చేసి అలిసిపోయి ఉంటారు ఈ సమయంలోకొత్త టేస్ట్ తినాలని ఉంటుంది అన్ని ఇంట్లోనే చెయ్యాలంటే అది అవ్వదు కొన్ని బయటకు వెళ్లి తినాలి తప్పదు

అలా ఓ నాన్ వెజ్ లవర్ ఎంతో ఇష్టంగా మటన్ బిర్యానీ తిందామని ఆశగా వెళ్ళాడు అయితే అక్కడ ప్లేట్ లో పెట్టిన మాంసం చూసి ఖంగు తిన్నాడు అలా కస్టమర్లకు మటన్ కు బదులు బీఫ్ బిర్యానీ పెడుతున్నారు. దీంతో కొందరు వెంటనే గుర్తించి గొడవకు దిగడంతో ఈ రచ్చ పోలీసుల వరకు వెళ్ళింది. ఈ వింత ఘటన బెంగళూరులో బొమ్మనహళ్ళిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరతిలో నివసించే కేరళీయులు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ను నడుపుతున్నారు. అయితే, ఈ రెస్టారెంట్లో కొన్ని వంటకాలలో తేడా జరుగుతుందని స్థానికులు గుర్తించారు ఇంకా ఇక్కడ మటన్ వంటకాలను ఆర్డర్ చేస్తే బీఫ్ను పెడుతున్నారంటూ వినియోగదారుల ఫిర్యాదులు చేసారు. అయితే, మెనూ కార్డులో బీఫ్ లేనే లేదు

మటన్ ఆర్డర్ చేస్తే, బీఫ్ ప్లేట్ లో పెట్టారని చాలామంది ఫిర్యాదు చేశారు. అసలు నిజమేంటో తెలుసుకోవడానికి పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసారు. ఒక పోలీసు అధికారి వింత డ్రెస్ లో హోటల్కు వెళ్ళారు మటన్ బిర్యానీ ఆర్డర్ చెయ్యగా బీఫ్ ముక్కలు పెట్టి ఇచ్చారు నిందితులను అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపారు.

ఈ కేసులోని కొందరు నింధితులు పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత రెస్టారెంటును కూడా సీజ్ చేశారు. మేము ఇంతకాలం తిన్నది బీఫా అని కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మటన్ తినేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం లేదంటే లేని పోనీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.