
భారత్లో జనాభా సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే చైనాను దాటేసి అగ్ర స్థానంలోకి చేరుకుంది భారత్. ఓవైపు జనాభాలో ఇండియా దూసుకుపోతుంటే, మరోవైపు చైనా మాత్రం తగ్గిపోతోంది. క్రమంగా చైనా జనాభా తగ్గుముఖం పడుతోంది.

ఈ నేపథ్యంలోనే వరల్డ్ ఆఫ్ స్టాటస్టిక్స్ 2100 నాటికి ప్రపంచ జనాభా ఎలా ఉండనుందన్న దానిపై కొన్ని గణంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ ప్రపంచలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుండగా. చైనా రెండో స్థానంలో నిలవనుంది.

అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యత్యాసం భారీగా ఉండనుంది. 2100 నాటికి భారత జనాభా 1,533 మిలియన్లకు చేరుతుండగా, చైనా జనాభా మాత్రం 771 మిలియన్ల వద్ద ఉండనున్నట్లు తెలిపారు.

ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండే మూడో దేశంగా 546 మిలియన్లతో నైజీరియా నిలవనుంది. తర్వాతి స్థానంలో 487 మిలియన్ల జనాభాతో పాకిస్థాన్ ఉండనుంది.

431 మిలియన్ల జనాభాతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అత్యధిక జనాభా ఉండనున్న 4వ స్థానంలో ఉండనుంది. ఇక అగ్ర రాజ్యం అమెరికా సైతం జనాభాలో దూసుకుపోనుంది. 394 మిలియన్ల మందితో 5వ స్థానంలో ఉండనుంది. ఇక 2100 నాటికి ప్రపంచ జనాభా 10.35 బిలియన్లకు చేరుకోనుంది.