పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం
పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే అందుకు కారణంగా తెలుస్తోంది.
పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ సస్పెండ్ చేశారు. బాలకృష్ణన్పై గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి విచారణ కమిటీ కూడా ఏర్పాటైంది. ఇవాళ విచారణ కమిటీ ఎదుట బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కమిటీ ప్రస్తుతం విచారణ చేస్తుంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం ఉండటం లేదని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
Also Read :
“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !