కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక వింతైన రోడ్డు ప్రమాదం స్థానికులకు పండుగ తెచ్చిపెడితే, పోలీసులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారిపై బీరు కంటైనర్ - మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకు కాపాలా కాయలేని పోలీసులు నానా హైరానా పడ్డారు.

కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!
Beer Container Accident

Updated on: Apr 15, 2026 | 3:55 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక వింతైన రోడ్డు ప్రమాదం స్థానికులకు పండుగ తెచ్చిపెడితే, పోలీసులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారిపై బీరు కంటైనర్ – మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకు కాపాలా కాయలేని పోలీసులు నానా హైరానా పడ్డారు.

ఝాన్సీ – కాన్పూర్ జాతీయ రహదారిపై, మోంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరట్ నుండి వేలకొద్దీ బీరు బాటిళ్లతో వస్తున్న ఒక భారీ కంటైనర్, ఎదురుగా మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్కును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రక్కులోని మిరపకాయల బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఘాటైన వాసనతో నిండిపోయింది. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం బీరు కంటైనర్!

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికులు సరుకును ఎత్తుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీరు కంటైనర్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్క బాటిల్ కూడా బయటకు పోకుండా చూడటానికి కంటైనర్ చుట్టూ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం ఒకెత్తయితే, ఆ ‘లిక్విడ్ గోల్డ్’ను కాపాడటం పోలీసులకు మరో పెద్ద టాస్క్‌గా మారింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. భారీ క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి, రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం మరోసారి హెచ్చరించింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఈ ‘బీరు-మిర్చి’ ప్రమాదం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us