Uttar Pradesh: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. 40 ఇంజక్షన్లు తీసుకుని ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్లో ఓ యువకుడు తన ప్రియురాలితో విడిపోవడం షాక్ని తట్టుకోలేకపోయాడు. హోటల్లో అద్దెకు గది తీసుకున్నాడు. తెల్లారి చూసేరికీ అతను స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. తీరా చూస్తే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్లో ఓ యువకుడు తన ప్రియురాలితో విడిపోవడం షాక్ని తట్టుకోలేకపోయాడు. హోటల్లో అద్దెకు గది తీసుకున్నాడు. తెల్లారి చూసేరికీ అతను స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. తీరా చూస్తే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయే ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతేకాదు తన డెడ్ బాడీని తన అన్నకు మాత్రమే ఇవ్వాలని రాసి ఉంది.
చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ హోటల్ గదిలోనే గ్లూకోజ్లో మత్తు మందు ఎక్కువ మోతాదులో వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హోటల్ గది తెరవకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం ప్రజలకు తెలిసింది. తలుపులు పగులగొట్టి చూడగా బెడ్పై యువకుడి మృతదేహం కనిపించింది. కర్టెన్ రాడ్కు గ్లూకోజ్ బాటిల్ వేలాడదీయగా, యువకుడి కుడి చేతికి డ్రిప్ తగిలింది.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ తన ప్రియురాలి చేతిలో ప్రేమలో మోసపోయానని రాశాడు. అందుకే 40 ఇంజక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, మృతుడి పేరు విజయ్ సింగ్గా గుర్తించారు. నౌబస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓటీ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. విజయ్ సింగ్ గత ఐదేళ్లుగా ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగి విజయ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి, ఫిర్యాదు చేసింది.
దీంతో విచారణ చేపట్టారు పోలీసులు. విజయ్కి ఇదివరకే వివాహమైందని, అతడి మొదటి భార్య అతడిని విడిచిపెట్టిందని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆమెతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుండి విడాకులు లేకపోవడంతో, ఆమె వివాహం చెల్లదని, అందుకే ఆమె విజయ్తో కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. కానీ వారి సంబంధం మళ్లీ మెరుగుపడలేదు.
దీన్ని విజయ్ తట్టుకోలేక బుధవారం కోయిలా నగర్లోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్లో, విజయ్ తన మరణానికి ముందు, “నేను విజయ్ సింగ్ యాదవ్, మీరు నాకు మంచి చేయలేదు. మీరు నా ఐదేళ్లతో పాటు మిగిలిన కెరీర్ను కూడా నాశనం చేశారు. దయచేసి అందరూ నన్ను క్షమించండి. నా ప్రాణం పోగొట్టుకున్నాను. నా డెడ్ బాడీని ఆశిష్ భయ్యాకి తప్ప ఎవరికీ ఇవ్వొద్దు. నా మృతదేహాన్ని ప్రియురాలిని మాత్రం చూడనివ్వద్దు అంటూ నోట్లో రాసుకొచ్చాడు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం కోసం తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…