‘సుశాంత్ కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేస్తున్నారు’ , లాయర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 02, 2020 | 8:34 PM

సుశాంత్ కేసును అడ్డుపెట్టుకుని అతని కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేసే యత్నాలు జరుగుతున్నాయని అతని ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. మరాఠీలో రాసిన స్టేట్ మెంట్లపై..

సుశాంత్ కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేస్తున్నారు , లాయర్
Follow us on

సుశాంత్ కేసును అడ్డుపెట్టుకుని అతని కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేసే యత్నాలు జరుగుతున్నాయని అతని ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. మరాఠీలో రాసిన స్టేట్ మెంట్లపై సంతకాలు చేయవలసిందిగా సుశాంత్ సిస్టర్స్ ని ముంబై పోలీసులు ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. ఆ స్టేట్ మెంట్లలో ఏం రాసి ఉందో వారు తెలుసుకోలేకపోయారని ఆయన చెప్పారు. మా కుటుంబ ప్రతిష్టను గౌరవాన్ని దిగజార్చే ప్రచారం కూడా సాగుతోందని సుశాంత్ సిస్టర్స్ వాపోతున్నారని, దయచేసి ఇప్పటికే మానసిక క్షోభతో కుమిలిపోతున్న ఈ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేయవద్దని కోరుతున్నానని ఆయన అన్నారు.