
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పూర్నియా జిల్లాలో ఒక ర్యాలీలో పాల్గొని, రూ.36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఉత్తర బీహార్ పట్టణంలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు, ఇది ఈ ప్రాంత దీర్ఘకాల విమాన కనెక్టివిటీ డిమాండ్ను తీరుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన జాతీయ మఖానా బోర్డును కూడా ప్రారంభించనున్నారు.
సూపర్ ఫుడ్గా పేరొందిన మఖానా లేదా భారతీయ ఫాక్స్ నట్స్ బీహార్లో సమృద్ధిగా పండిస్తారు, ఇది దేశంలోని ఉత్పత్తిలో దాదాపు 90 శాతం వాటా కలిగి ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రధానమంత్రి బీహార్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నమ్ముతుంది. తన 11 సంవత్సరాల పదవీకాలంలో మోదీ బీహార్కు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కాగా ప్రధాని రాకతో జిల్లాలో విస్తృతమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి, ఇక్కడ జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల రాకపోకలు ఆదివారం అర్ధరాత్రి నుండి 24 గంటలు నిలివేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి