AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుండి జీఎస్టీ పొదుపు పండుగ.. అందరూ సంతోషంగా ఉంటారు: ప్రధాని మోదీ

రేపటి నుండి జీఎస్టీ పొదుపు పండుగ.. అందరూ సంతోషంగా ఉంటారు: ప్రధాని మోదీ

Balaraju Goud
|

Updated on: Sep 21, 2025 | 5:25 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు, ప్రధాని మోడీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రేపు అమలు చేయబోయే కొత్త జీఎస్టీ రేట్లపై ప్రధాని చర్చించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు, ప్రధాని మోడీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నవరాత్రి మొదటి రోజున స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రేపటి నుండి అందరికీ తీపి కబుర్లు అందుతాయన్నారు. పొదుపు పండుగ నుండి అందరూ ప్రయోజనం పొందుతారన్నారు. ఈ కొత్త రేట్లు అనేక వస్తువుల ధరలను తగ్గిస్తాయని, సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఇది అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్నారు.  ఇదిలావుంటే, సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ సంస్కరణలు తదుపరి తరం సంస్కరణలని ప్రధాని మోదీ అన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా మేము వాటిని అమలు చేసాము. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి, వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి. పెట్టుబడిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. అభివృద్ధి రేసులో ప్రతి రాష్ట్రాన్ని సమాన భాగస్వామిగా చేస్తాయి. ఈ జీఎస్టీ సంస్కరణలు “నాగరిక్ దేవో భవ” (ప్రజలే దేవుళ్ళు) అనే మంత్రాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి, మనం స్వావలంబన భారతదేశం వైపు పయనించాలి.’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ఈ కొత్త రేట్లు అనేక వస్తువుల ధరలను తగ్గిస్తాయని, సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఇది అతిపెద్ద సంస్కరణగా పరిగణించబడుతుంది. ఇప్పుడు దేశం మొత్తం ప్రధాని మోదీ ప్రసంగంపై దృష్టి సారించింది. ఈ ప్రసంగం ఆర్థిక మరియు ప్రపంచ సమస్యల నుండి మాత్రమే కాకుండా సాంస్కృతిక, మతపరమైన దృక్కోణాలలో ముఖ్యమైనది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Sep 21, 2025 05:01 PM