Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేగింది. ప్రయాణ మధ్యలో ఓ ప్యాసింజర్ కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి యత్నించగా.. హైజాక్‌ భయంతో పైలట్‌ తలుపు తెరవలేదు. విమానం ల్యాండ్‌ అయ్యాక CISF సిబ్బంది అతడిని అరెస్ట్‌ చేశారు ... ..

Mid-Air Scare: ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరిచే యత్నం..!
Air India Flight

Updated on: Sep 22, 2025 | 6:04 PM

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి ప్రయత్నించారు. హైజాక్‌ భయంతో పైలట్‌ తలుపు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానం సురక్షితంగా వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. వెంటనే CISF సిబ్బంది జోక్యం చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా టాయిలెట్ కోసం వెతుకుతుండగా ఆ ప్రయాణీకుడు కాక్‌పిట్ వరకు నడిచి వెళ్లడంతో ఈ గందరగోళం చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తాను తొలిసారి విమానంలో ప్రయాణం చేస్తున్నానని , ప్రొటోకాల్‌ తెలియదని ఆ ప్రయాణికుడు సిబ్బందికి తెలిపాడు.

అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్‌ ప్రకారం ఆ ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నట్టు CISF తెలిపింది. మణితో పాటు అతడితో ప్రయాణం చేస్తున్న 8 మందిని CISF అధికారులు ప్రయత్నిస్తున్నారు.