ఉమ్మడి అర్హతా పరీక్షల నిర్వహణకు వెయ్యి కేంద్రాలు !

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 8:42 PM

దేశంలోని 700 జిల్లాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీ..

ఉమ్మడి అర్హతా పరీక్షల నిర్వహణకు వెయ్యి కేంద్రాలు !
Follow us on

దేశంలోని 700 జిల్లాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మొదట 12 భాషల్లోనూ ఆ తరువాత మరిన్ని భాషల్లోనూ ఈ ఉమ్మడి అర్హతా పరీక్షలను నిర్వహించే యోచన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్ లైన్ సీఈటీ ని నిర్వహించాలని , ఇందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఈ నెల 19 న నిర్ణయించింది.