Ration Cards: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే ఈ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి

దేశంలోని ప్రజలకు ఆహార భద్రత అందించే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు(Ration Cards) అందిస్తోంది. వీటి ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, కిరోసిన్ వంటి వస్తువులను అందిస్తోంది. కాగా దేశంలో అర్హత కలిగిన వారి కంటే అనర్హులే ఎక్కువ....

Ration Cards: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే ఈ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి
Follow us

|

Updated on: Jun 29, 2022 | 6:11 PM

దేశంలోని ప్రజలకు ఆహార భద్రత అందించే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు(Ration Cards) అందిస్తోంది. వీటి ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, కిరోసిన్ వంటి వస్తువులను అందిస్తోంది. కాగా దేశంలో అర్హత కలిగిన వారి కంటే అనర్హులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ తొలగించే పనిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు వీటన్నింటినీ గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఇప్పటికే చాలా మంది లబ్ధిదారుల రేషన్‌కార్డులు రద్దయ్యాయి. రేషన్‌లో నకిలీలను అరికట్టేందుకు కార్డు వెరిఫికేషన్‌(Ration Card Verification) జరుగుతోంది. తద్వారా అర్హులైన వారికి రేషన్ సరకులు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బిహార్‌ రాష్ట్రంలోని గయా జిల్లాలోని షేర్‌ఘటిలో 12 వేలకు పైగా నకిలీ రేషన్ కార్డులను అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ రద్దు చేశారు. చాలామంది రేషన్‌కార్డుదారులు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వారందరికి నోటీసులు జారీ చేసింది.

ఇందులో కొన్ని ఫేక్‌ రేషన్‌ కార్డు దారులు ఉన్నట్లు గుర్తించింది. వారి రేషన్‌కార్డులను రద్దు చేసింది. వ్యవసాయ భూ యజమానులు, ట్రాక్టర్-ట్రక్కు, కారు-బైక్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తుల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే రేషన్‌ కట్‌ అవుతుంది. రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం..