కరోనా భయం.. ఈ నెల 25 వరకు రైళ్లు బంద్ ?
కరోనా మరింత విస్తరించకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా రైళ్లు ఈ నెల 25 వరకు నడవబోవని ఈ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో 8 మంది కరోనా అనుమానితులను కనుగొన్న సంగతి విదితమే.
కరోనా మరింత విస్తరించకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా రైళ్లు ఈ నెల 25 వరకు నడవబోవని ఈ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో 8 మంది కరోనా అనుమానితులను కనుగొన్న సంగతి విదితమే. దీంతో కోవిడ్-19 నివారణకు మూడు వేల రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. కాగా-దేశంలో కరోనా కేసులు 324 కి పెరిగాయి.వీరిలో 22 మంది రోగులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 63 కి పెరగగా.. దేశంలో ఈ వ్యాధికి గురై మరణించినవారి సంఖ్య ఐదుకు పెరిగింది. తాజాగా మహారాష్ట్ర (ముంబై)లో ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఇక పంజాబ్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలో అన్ని షాపులు, మాల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలో కరోనా కేసులు 40 కాగా.. వీరిలో ఏడుగురు విదేశీయులున్నారు. ఢిల్లీలో 27, యూపీలో 24, తెలంగాణాలో 21, ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 31 వరకు తమ రాష్ట్రంలో ప్రవేశించే అన్ని రైళ్లను నిలిపివేయాలని కోరుతూ ఝార్ఖండ్ ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వడోదర నగరాల్లో బుధవారం వరకు లాక్ డౌన్ ప్రకటించారు. గోవా తన సమీప రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. .