PM Modi: పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రికార్డ్.. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి?

మరికాసేపట్లో నరేంద్ర మోదీ మూడోవసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ.. తన టీమ్‌తో మరోసారి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌. ఒక్కడిగా కాదు, అందరితో కలిసి.. అలయన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్‌ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు.

PM Modi: పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రికార్డ్.. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి?
Pm Modi Record
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:05 PM

మరికాసేపట్లో నరేంద్ర మోదీ మూడోవసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ.. తన టీమ్‌తో మరోసారి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌. ఒక్కడిగా కాదు, అందరితో కలిసి.. అలయన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్‌ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు. అందులోనూ ఈ దఫా తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యత, ఎన్డీఏ సర్కార్‌ని సరికొత్తగా ఎలివేట్‌ చేస్తోంది. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి? ఎదుర్కొవాల్సిన సవాళ్లేంటీ?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి.. మరోసారి కేంద్రంలో కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ.. తన టీమ్‌తో పాలనకు సిద్ధమయ్యారు. రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా,ప్రహ్లాద్‌ జోషి సహా.. దాదాపు 70 మందికిపైగా ఎంపీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. అనురాగ్‌ ఠాకూర్‌, పురుషోత్తం రూపాలా సహా పలువురు సిట్టింగ్‌ మంత్రులకు కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కలేదు.

గత రెండు దఫాలు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు.. అన్నట్టుగా కేబినెట్‌ కూర్పు జరిగినట్టు తెలుస్తోంది. భాగస్వామ్య పార్టీలకు కేబినెట్‌ బెర్తుల విషయంలో ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది. కూటమిలో భాగమైన ఇతర పార్టీలకు… దాదాపు 12 కేబినెట్‌ పదువులు కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. 2014, 2019 ఎన్నికల్లో ఈస్థాయి మంత్రిపదవులను మిత్రపక్షాలకు కేటాయించలేదు. ఈసారి దక్షిణాది నుంచి కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మంచిప్రాతినిథ్యం దక్కింది.

ముఖ్యంగా కేబినెట్‌ కూర్పులో.. తెలుగు రాష్ట్రాలకు ఈసారి అగ్రపీఠం వేసింది బీజేపీ అధిష్టానం. ఏపీ నుంచి మూడు కేంద్ర మంత్రిపదవులను కట్టబెట్టింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసరాపురం ఎంపీ శ్రీనివాస వర్మలకు.. కేంద్ర మంత్రులకు అవకాశం దక్కడం విశేషం. కారణాలేమిటనేది తెలియదుగానీ, కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు మాత్రం.. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కలేదు.

తెలంగాణకు ఈసారి రెండు కేంద్ర మంత్రిపదవులు దక్కాయి. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా కొనసాగిన సికిందరాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు మోదీ. కొత్తగా, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

మిత్రపక్షాల సమ్మిళితంగా.. అందరికీ ప్రాధాన్యమిచ్చేలా ఏర్పడిన మోదీ 3.ఓ టీమ్‌.. రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనుంది? అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే, గత రెండు దఫాలు ఫుల్‌ మెజార్టీతో ఉన్న బీజేపీ.. ఈసారి మిత్ర పక్షాల సపోర్టుతో గద్దెనెక్కిన పరిస్థితి. మరి, మూడో దఫా మోదీ పాలనలో.. భవిష్యత్‌ భారతం ఎలా ఉంటుందో చూడాలి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్