త్వరలో మరో 120 రైళ్లు ! రైల్వే శాఖ యోచన

దేశంలో అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్ర రవాణాతో బాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే శాఖ త్వరలో మరో 120 రైళ్లను నడపనుంది. ఇందుకు తమ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోను..

త్వరలో మరో 120 రైళ్లు ! రైల్వే శాఖ యోచన

Edited By:

Updated on: Sep 01, 2020 | 7:26 PM

దేశంలో అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్ర రవాణాతో బాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే శాఖ త్వరలో మరో 120 రైళ్లను నడపనుంది. ఇందుకు తమ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోను, హోమ్ మంత్రిత్వ శాఖతోను సంప్రదింపులు జరుపుతోందని ఈ శాఖ అధికారులు చెప్పారు. తొలి దశలో 100 రైళ్లను నడపనున్నారు. ఆ తరువాత మిగతా రైలు సర్వీసులను నిర్వహించనున్నామన్నారు. ప్రస్తుతం 230 స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.

అయితే ఎప్పటికప్పుడు కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం ఈ సర్వీసులను నిర్వహిస్తామని, ప్రయాణికులకు అనుగుణంగా  మార్గదర్శక సూత్రాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.