India Covid-19 Updates: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసుల వివరాలివే..
India Corona Cases: దేశంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, నిన్నటికి
India Corona Cases: దేశంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, నిన్నటికి ఇవాళ్టికి స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజులో 14,413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,07,189(0.25శాతం) యాక్టీవ్ కేసులు ఉండగా.. రోజువారీ పాజిటివ్ రేట్ 3.40 శాతంగా ఉంది. కాగా, నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు 1,700 లకు పైగా తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్ను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. దేశంలో రోజువారీ పాజిటివ్ రేట్ 3.40 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివ్ రేటు 3.59 శాతం ఉంది. రికవరీ రేటు 98.55 శాతం ఉంది. ఇకపోతే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 4,28,36,906 మంది కోలుకున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. అలాగే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 197.74 కోట్ల వ్యాక్సీన్ డోసులను వేయడం జరిగిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇక 12 నుంచి 14 ఏళ్ల వారికి 3.67 కోట్ల డోసులు వేయడం జరిగిందని పేర్కొన్నారు.