
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. భారత్లో జరిగిన ఉగ్రదాడి వెనకాల పాకిస్థాన్ హస్తం ఉందని భావించిన భారత్ ఆదేశానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్ పాకిస్థాన్కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి భారత్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే కాకుండా అక్కడి నుంచి ఎగుమతైన వస్తువులను కూడా భారత్లోకి అనుమతించేది లేదని భారత వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితి విధిండం జరిగిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ వాణిజ్యశాఖపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. భారత్ పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్తో భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం చాలా తక్కువగా ఉంది. భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యంలో పాకిస్తాన్తో జరిగే వాణిజ్యం కేవలం 0.06 శాతం మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అయితే 2019లో పుల్వామా దాడి తర్వాతనే భారత్-పాకిస్తాన్ నుంచి దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు.. ఈ దేశ ఉత్పత్తులపై సుమారు 200 శాతం సుంకం విధించింది.
కాగా జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందారని దర్యాప్తులో తేలడంతో.. పాకిస్థాన్ సహకారంతోనే ఈ ఉగ్రదాడి జరిగినట్టు భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, భారత్లో ఉన్న పాకిస్థాన్ దేశస్తులను దేశం నుంచి పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోవడం వంటి నిర్ణయాలతో పాటు, భారత్-పాక్ మధ్య ఉన్న దౌత్య ఒప్పందాలను కూడా రద్దు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…