సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

| Edited By:

Jul 07, 2020 | 3:41 PM

ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్...

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు
Follow us on

భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్యం. అదే విధంగా భారత్ కూడా వివాదాస్పదంగా మారిన ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను తొలగించింది.

ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్ చక్కర్లు కొట్టింది. తూర్పు గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెళ్లిపోతున్న తరుణంలో దాన్ని నిర్థారించుకునేందుకు ఈ చర్యలు ప్రారంభించారు భారత అధికారులు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కూడా ఐఏఎఫ్ అధికారులు విడుదల చేశారు.