అందంగా ఉండటమే పాపమైంది.. భార్యను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
భార్య ఎంతో అందంగా ఉండటం, మంచిగా తయారై బయటకు వెళ్లడాన్ని ఆ భర్త సహించలేకపోయాడు.. అలా తయారయ్యి.. బయటకు వెళ్లొద్దని.. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. అయితే.. ఆమె వినేది కాదు.. చివరకు భర్త సహించలేక.. దారుణానికి పాల్పడ్డాడు..
![అందంగా ఉండటమే పాపమైంది.. భార్యను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/crime-news-16.jpg?w=1280)
ఎవ్వరైనా సరే తనకు కాబోయే భార్య అందంగా, చదువుకున్న వారై ఉండాలనుకుంటారు.. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్.. అయింది.. భార్య అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు.. చివరకు ఆమెను కడతేర్చాడు.. భార్య ఎంతో అందంగా ఉండటం, మంచిగా తయారై బయటకు వెళ్లడాన్ని ఆ భర్త సహించలేకపోయాడు.. అలా తయారయ్యి.. బయటకు వెళ్లొద్దని.. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. అయితే.. ఆమె వినేది కాదు.. చివరకు భర్త సహించలేక.. దారుణానికి పాల్పడ్డాడు.. నమ్మించి బయటకు తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో రామనగర జిల్లాలో చోటుచేసుకుంది.. రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు.. అయితే.. దివ్య ఎప్పుడూ అందంగా కనిపించాలనే తపనతో పెదాలకు లిప్స్టిక్ వేసుకునేది. అంతటితోనే కాకుండా ఓ టాటూ కూడా వేయించుకుంది. ఇలా చేయొద్దని దివ్యకు ఉమేష్ పలు మార్లు చెప్పాడు.. ఈ పద్ధతులు మార్చుకోవాలని ఉమేశ్ గొడవ పడేవాడు. అంతేకాకుండా.. ఆమెపై అనుమానం కూడా ఉండేది. దీంతో పుట్టింటికి వెళ్లింది.
ఓవైపు భర్త అనుమానం.. మరోవైపు వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్ వేసింది.. ఈ కేసులో మంగళవారం ఇద్దరూ కోర్టులో విచారణకు హాజరయ్యారు.. ఇకపై అనుమానించనని, మంచిగా చూసుకుంటానని దివ్యను ఉమేశ్ నమ్మించాడు. భర్త మారాడనుకుని ఆయన మాటలను దివ్య నమ్మింది.. అనంతరం భార్యా భర్త ఇద్దరూ కలిసి ఊజగల్లు దేవాలయానికి వెళ్లారు. అయితే దివ్యను హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న ఉమేశ్.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లాడు.. అనంతరం ఉమేష్ తన నలుగురు స్నేహితులతో కలిసి భార్యను దారుణంగా చంపాడు.
అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..