
పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అలాగే.. పాల నుంచి తీసిన నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలతోపాటు ఔషధగుణాలు దాగున్నాయి.. అయితే.. ఒక గ్లాసు వేడి పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ కాంబినేషన్ కొంచెం వింతగా అనిపించినా, నెయ్యి – పాలు కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు.
పాలు, నెయ్యి మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలో పోషకాల శోషణ పెరుగుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, ఇది ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్లు అన్నీ మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఎముకల ఆరోగ్యం నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు ప్రతిదీ మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేడి పాలలో నెయ్యి కలిపి రాత్రిపూట తాగితే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. ముందుగా పాలు వేడి చేసి దానిలో కొంచెం నెయ్యి కలుపుకోవాలి.. గోరువెచ్చగా అయిన తర్వాత.. తాగండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..