తమిళనాడులో తండ్రీ కొడుకుల మృతి.. పోటెత్తిన పొలిటికల్ వార్

తమిళనాడులో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ట్యుటికోరన్ లో తమ సెల్ ఫోన్ షాపును సమయానికి మించి తెరచి ఉంచారన్న కారంణంపై వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారని, లాకప్ లో..

తమిళనాడులో తండ్రీ కొడుకుల మృతి.. పోటెత్తిన పొలిటికల్ వార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2020 | 6:51 PM

తమిళనాడులో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ట్యుటికోరన్ లో తమ సెల్ ఫోన్ షాపును సమయానికి మించి తెరచి ఉంచారన్న కారంణంపై వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారని, లాకప్ లో చిత్రహింసలు పెట్టడంతో.. తీవ్రంగా గాయపడి 4 రోజుల అనంతరం ఆసుపత్రిలో మృతి చెందారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. పోలీసుల దమనకాండకు పాలక అన్నా డీఎంకె పార్టీయే కారణమని, చట్టాన్ని వారు చేతిలోకి తీసుకోవడానికి ఆ పార్టీ నాయకులు అనుమతించారని విపక్ష డీఎంకే ఆరోపించింది. అటు-రక్షక భటులే భక్షించే వారయ్యారని, ఈ తండ్రీ కొడుకుల మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పోలీసుల అమానుషత్వాన్ని ఉపేక్షిస్తే అది నేరమే అవుతుందన్నారు. గుజరాత్ కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ.. ఈ ఘటననుఁ అమెరికాలో నల్ల జాతీయుడు జార్జిఫ్లాయిడ్ మరణంతో పోలుస్తూ ట్వీట్ చేశారు. అటు-ప్రియాంక చోప్రా, క్రికెటర్ శిఖర్ ధావన్, నటుడు జయం రవి వంటి వారు కూడా ఈ ఘటనను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. జయరాజ్, బెనిక్స్ మృతికి నిరసనగా రాష్ట్రమంతా ఈ నెల 24 న బంద్ పాటించారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?