దిశ మరణం తరువాత కూడా యాక్టివ్ లోనే ఆమె ఫోన్ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 4:36 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త విషయాలు తెలిశాయి. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య అనంతరం తొమ్మిది రోజుల తరువాత కూడా ఆమె ఫోన్ యాక్టివ్ లో..

దిశ మరణం తరువాత కూడా యాక్టివ్ లోనే ఆమె ఫోన్ !
Follow us on

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొత్త విషయాలు తెలిశాయి. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య అనంతరం తొమ్మిది రోజుల తరువాత కూడా ఆమె ఫోన్ యాక్టివ్ లోనే ఉందట. సుశాంత్ సూసైడ్ కి ఆరు రోజుల  ముందు దిశ తన అపార్ట్ మెంట్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జూన్ 9-జూన్ 17 మధ్య పలు ఫోన్ కాల్స్ అందులో ఉన్నట్టు గుర్తించారు. ఆమె మృతి తరువాత ఆమె ఫోన్ ని ఎవరు వినియోగించారన్నది మిస్టరీగా ఉంది. దిశ మృతికి రెండు రోజుల ముందు జూన్ 6 న ఆ ఫోన్ నుంచి 3 కాల్స్, జూన్ 7 న అదే ఫోన్ నుంచి రాత్రి 12.02, 12.57 మధ్య రెండు వేర్వేరు ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలిసిందని సీబీఐ వర్గాల సమాచారం. జూన్ 7 న ఆమె కనీసం 36 కాల్స్ చేసిందని, అందులో రాత్రి 12.10 గంటలకు తన ఫ్రెండ్ ఏక్తాకు చేసిన కాల్ కూడా ఉందని వెల్లడవుతోంది. ఆమె సూసైడ్ వార్త తెలిసిన వెంటనే ముంబై పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లినప్పటికీ ఈ ఫోన్ ని స్వాధీనం చేసుకోలేదు.